మొదటి రోజు: సికింద్రాబాద్ నుండి ఎర్నాకుళం వరకు రైలు ప్రయాణం.
రెండవ రోజు – ఎర్నాకులం రైల్వే స్టేషన్ నుండి హోటల్ వరకు ప్రయాణం. నిత్యకృత్యాలు పూర్తి అయ్యాక భోజనం ఆ తర్వాత చోటానిక్కర్ అమ్మవారి దర్శనం మరియు త్రిక్కాకర వామన మూర్తి ఆలయాలను దర్శించి రాత్రికి ఎర్నాకుళం వద్ద హోటల్ నందు బస.
మాడవ రోజు – ఎర్నాకుళం నుండి బయలుదేరి కాలడిలోనున్న జగద్గురు శంకరాచార్యుల వారి ఆలయ దర్శనం, త్రిశూర్ లో వడక్కుమనాథన్ ఆలయం, అత్తిరాపల్లి జలపాతాలు దర్శించి రాత్రికి గురువాయూర్లో బస.
నాల్గవ రోజు – గురువాయూర్ నుండి బయలుదేరి మున్నార్కు ప్రయాణం అక్కడి సందర్శనీయ స్థలములను దర్శించి తేక్కడిలో రాత్రికి బస.
అయిదవ రోజు: తేక్కడిలో స్థానిక దృశ్యాలు దర్శించి మధ్యాహ్న భోజనం అనంతరం ఎరుమాలి వరకు ప్రయాణం మరియు రాత్రికి బస.
ఆరవ రోజు – ఎరుమేలి నుండి పంబ వరకు ప్రయాణం. పంబ నుండి శబరిమలైకు ప్రయాణం (నడక మార్గమున) దర్శనం అయినా ప్రయాణం. రాత్రికి అలెప్పి వద్దనే బస.
ఏడవ రోజు – అలెప్పి బోట్ షికారు, భోజన సమయం, పందళం, చెంగనూర్ మరియు అచ్చన్కోవిల్కు ప్రయాణించి రాత్రికి అలెప్పి వద్దనే బస.
ఎనిమిదవ రోజు – ఉదయాన్నే అలెప్పి నుండి అరియంకావు అయ్య, కుళుత్తపుళ బాలక ఆలయాలు దర్శించి సాయంత్రం వేళ కొల్లం సముద్ర వద్ద సమయం మరియు రాత్రికి తిరువనంతపురం వద్ద బస.
తొమ్మిదవ రోజు – అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ దర్శనం, సందర్శనీయ స్థలములు దర్శించి రాత్రికి బస.
పదవ రోజు – తిరువనంతపురం నుండి విజయవాడ/వరంగల్/హైదరాబాద్ వరకు రైలు ప్రయాణం.
గమనిక:
- యాజమాన్యం వారిచే ఇద్దరికి ఒక ఏసి గది (జంటకు) సదుపాయం కల్పించబడును.
- ఏ.సి 2*2 పుష్ బ్యాక్ బస్సు సదుపాయం కల్పించబడును.
- ఎంట్రీ టికెట్లు, విశేష దర్శన టికెట్లు, ఆటో, బోటు యరియు ఇతరతరా చిల్లర ఖర్చులకు యాత్రికులే చెల్లించవలెను.
- రాను పోను 3ఏసి రైల్వే టికెట్ ఖర్చులు యాజమాన్యం వారివే.
- ఉదయం టీ/కాఫీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ యాజమాన్యం వారిచే ఏర్పాటు చేయబడును.
- రోజుకు 02 త్రాగు నీరు బాటిల్స్ ఏర్పాటు యాజమాన్యం వారిచే చేయబడును.
- యాత్రికుల సామాన్లకు, వ్యక్తిగత వస్తువులకు, డబ్బులు మరియు బంగారు ఆభరణాలు తదితర జాగ్రత్తలు వారే తీసుకోనవలెను. యాజమాన్యం వారితో ఏ సంబంధము ఉండదు.
- యాజమాన్యం వారికి ఎల్లప్పుడూ యాత్రికులు సహాయ సహకారములతో యాత్రను దిగ్విజయంగా పూర్తి గావించే విధంగా నడుచుకోవలెను.
- అనుకోని పరిస్థితులు (ప్రకృతి, రాజకీయ, ప్రాంతీయ మరియు అనూహ్యమైన) సంభవించిన యెడల యాత్రలో మార్పులు చేర్పులు చేయబడును అందుకు యాత్రికుల సహకరించవలెను.
- ఎడ్వాన్సు తిరిగి ఇవ్వబడదు.
- ఆటో, పడవ, గుర్రం, డోలి, ప్రత్యేక దర్శనములకై అయ్యే ఖర్చులు మరియు యే ఇతరతర ఖర్చులు ఉన్నాను యాత్రికులే చెల్లించుకోవలెను.
- యాత్రికులు తప్పని సరిగా వారితో సంప్రదాయ దుస్తులు తీసుకురావలెను. (మగవారు పంచ, ఉత్తరీయము, ఆడవారు చీర తదితర దుస్తులు). ఆలయాల దర్శనాలకు సంప్రదాయ దుస్తులు వేసుకునే వారినే అనుమతించబడును.
- ఆలయాల దర్శన వేళలను అందరూ తప్పక పాటిస్తేనే సకాలంలో అన్ని చూడగలము. సమయానుకూలంగా మరికొన్ని ఆలయాలు కూడా సందర్శింపచేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాము.
మంగళం మహత్