09-02-2025: రాత్రి 09.30 ని.లకు హైదరాబాద్ నుండి బస్సు బయలుదేరును.
10-02-2025: మార్గం మధ్యలో నిత్యకృత్యాలు, భోజనం ఏర్పాట్లు ముగించుకుని ప్రయాణం కాశి వరకు కొనసాగును. చిత్రకూటం వద్ద బస. (సుమారుగా 1100కి.మీల ప్రయాణం రెండు రోజులకు)
11-02-2025: చిత్రకూటంలో ముఖ్యమైన ఆలయాల దర్శనం మరియు రాత్రికి బస.
12-02-2025: చిత్రకూటం నుండి తెల్లవారుజామున బయలుదేరి ప్రయాగ వరకు ప్రయాణం. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం, విధులు పూర్తయ్యాక నైమిశారణ్యం వరకు ప్రయాణం రాత్రికి బస. (సుమారుగా 450కి.మీల ప్రయాణం)
13-02-2025: నైమిశారణ్యములో గల ఆలయాలను దర్శించిన తర్వాత అయోధ్యకు ప్రయాణం మరియు బస. (సుమారుగా 250కి.మీల ప్రయాణం)
14-02-2025: అయోధ్య రామ జన్మభూమి మరియు దర్శనీయ స్థలములు దర్శించి వారణాసి వరకు ప్రయాణం. కాశిలో రాత్రికి బస. (సుమారుగా 240కి.మీల ప్రయాణం రెండు రోజులకు)
15-02-2025: కాశిలో ముఖ్యమైన ఆలయాలు దర్శించుట మరియు రాత్రికి బస.
16-02-2025: కాశి నుండి హైదరాబాదు వరకు బస్సు ప్రయాణం.
17-02-2025: బస్సు ప్రయాణం. (సుమారుగా 1250కి.మీల ప్రయాణం రెండు రోజులకు)
హైదరాబాద్ కు చేరుకొనుటతో యాత్ర సమాప్తి.
గమనిక:
2nd batch Trip starts at 19th February

- యాజమాన్యం వారు నలుగురికి ఒక గది సదుపాయం కల్పించబడును.
- ఏ. సి 2*2 పుష్ బ్యాక్ బస్సు సదుపాయం కల్పించబడును.
- ఎంట్రీ టికెట్లు, విశేష దర్శన టికెట్లు, ఆటో, బోటు యరియు ఇతరతరా చిల్లర ఖర్చులకు యాత్రికులు చెల్లించవలెను.
- ఉదయం టీ/కాఫీ, టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ యాజమాన్యం వారిచే ఏర్పాటు చేయబడును.
- రోజుకు రెండు త్రాగు నీరు బాటిల్స్ ఇవ్వబడును.
- యాత్రికుల సామాన్లకు, వ్యక్తిగత వస్తువులకు, డబ్బులు మరియు బంగారు ఆభరణాలు వారి జాగ్రత్తలు తీసుకోనవలెను. యాజమాన్యం వారితో సంబంధం ఉండదు.
- యాజమాన్యం వారికి ఎల్లప్పుడూ యాత్రికులు సహాయ సహకారములతో యాత్రను దిగ్విజయంగా పూర్తి గావించవలనని మనవి.
- అనుకోని పరిస్థితులు (ప్రకృతి, రాజకీయ, ప్రాంతీయ మరియు అనూహ్యమైన) సంభవించిన యెడల యాత్రలో మార్పులు చేర్పులు చేయబడును అందుకు యాత్రికుల సహకరించవలెను.
- మగవారు పంచ, ఉత్తరీయం తప్పకుండా వెంట తెచ్చుకొనవలెను.
- ఆలయాల్లో అమ్మవారికి లేదా నదుల వద్ద సమర్పించుకొనుటకు పుసుపు, కుంకుమ, గాజులు, చీర, వస్త్రం తదితర ద్రవ్యములు ఏదైననూ యాత్రికులు తెచ్చుకొనవచ్చును.11. బస్సు యాత్రలో రెండు లేదా మూడు రోజులు రాత్రి ప్రయాణం ఉంటుంది. దానికి యాత్రికులు సహకరించవలెను.
- దూర ప్రయాణము చేసే రోజున మార్గ మధ్యలో ఎక్కడైనా కనీస సౌకర్యాల కొరకు బస్సును కొంత సమయం నిలిపివేసి కార్యక్రమాలు ముగిసిన తర్వాత ప్రయాణం కొనసాగించబడుతుంది.
శుభయాత్రా