30-04-2024 సికింద్రాబాద్ నుండి బిలాస్ పూర్ వరకు రైలు ప్రయాణం (17007 రైలు నం. రాత్రి 10:40 ని.లకు బయలుదేరును. బిలాస్ పూర్ మరుసటి రోజు అనగా 01-05-2024 తేది మధ్యాహ్నం 02:30 ని.లకు చేరుకొను సమయం)
01-05-2024 బిలాస్ పూర్ నుండి అమరక కంఠక్ వరకు బస్సు ప్రయాణం. ఆ రోజు రాత్రి అమరకంఠక్ వద్ద బస. (117కి.మీలు సుమారు రెండు గంటల ప్రయాణం).
02-05-2024 అమరకంఠక్ లో ఉన్న నర్మదా ఉద్గమ స్థలం వద్ద పవిత్ర పుష్కర స్నానం ఇత్యాదులు, ఆలయ దర్శనాలు చేసుకుని జబల్పూర్ వరకు సుమారుగా 06గం.ల ప్రయాణం ఉంటుంది (225 కి.మీలు) రాత్రికి జబల్పూర్ లో బస.
03-05-2024 జబల్పూర్ నగరంలో సందర్శనీయ స్థలాలు, నర్మదా నది తీరం, కచనార్ శివ దర్శనం మరియు రాత్రికి జబల్పూర్ లో బస.
04-05-2024 జబల్పూర్ నుండి ఖజురహో వరకు బస్సు ప్రయాణం సుమారుగా 06 గం.లు పడుతుంది (255 కి.మీలు) రాత్రికి ఖజురహో లో బస.
05-05-2024 ఖజురహోలోని ముఖ్య దేవాలయాల సందర్శన మరియు రాత్రికి బస.
06-05-2024 ఖజురహో నుండి భోపాల్ వరకు బస్సు ప్రయాణం సుమారుగా 09గం.లు (375 కి.మీలు) రాత్రికి భోపాల్ వద్ద బస.
07-05-2024 భోపాల్ లో ఉన్న ముఖ్యమైన సందర్శనీయ స్థలములు దర్శించిన తర్వాత సాయంత్రం ఉజ్జయిని వరకు ప్రయాణం రాత్రికి ఉజ్జయిని వద్ద బస సుమారుగా 04 గం.ల ప్రయాణం (192 కి.మీలు)
08-05-2024 ఉజ్జయిని మహాంకాళేశ్వరుని దర్శనం, సందర్శనీయ స్థలములు దర్శించి ఇండోర్ వరకు ప్రయాణం రాత్రికి ఇండోర్ వద్ద బస. సుమారుగా 1గం 30 ని.లు ప్రయాణం ఉంటుంది (55 కి.మీలు)
09-05-2024 ఇండోర్ నుండి ఓంకారేశ్వర్ అమరేశ్వర్ వరకు ప్రయాణం (78 కి.మీలు) సుమారుగా 02 గం.లు పడుతుంది. జ్యోతిర్లింగ దర్శనం అయిన తర్వాత మాహేశ్వర్ వరకు ప్రయాణం రాత్రికి బస (66 కి.మీలు)
10-05-2024 మాహేశ్వర్ శివాలయ దర్శనం అయిన తర్వాత రత్లామ్ వరకు బస్సులో ప్రయాణం సుమారుగా 03గం.ల 30 ని.లు పడుతుంది. (163 కి.మీలు)రత్లామ్ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం మరియు రాత్రికి బస.
11-05-2024 రత్లామ్ నుండి మండాసుర్ వరకు బస్సు ప్రయాణం సుమారుగా 02గం.లు (90 కి.మీలు) మండాసుర్ ఆలయ దర్శనం తర్వాత భోపాల్ వరకు బస్సులో ప్రయాణం సుమారుగా 07గం.లు పడుతుంది. (347 కి.మీలు)
భోపాల్ నుండి సికింద్రాబాద్ వరకు రైలు ప్రయాణం. 12724 తెలంగాణ ఎక్స్ప్రెస్ లో రాత్రి 01:30 ని.లకు (12-05-2024) సికింద్రాబాద్ అదే రోజు మధ్యాహ్నం 03:55 ని.లకు చేరుకొనును.
🙏🏻యాత్ర సమాప్తం 🙏🏻
🕉శభం భూయాత్🕉
యాత్రికులకు సూచనలు:
1. యాజమాన్యం వారు నలుగురు ఒక గది (రెండు మంచములు) సదుపాయం కల్పించబడును.
2. రానూపోనూ రైలు టికెట్ ఖర్చులు (3AC), ఏ.సి 2*2 పుష్ బ్యాక్ బస్సు సదుపాయం యాజమాన్యం వారిచే కల్పించబడును.
3. ఎంట్రీ టికెట్లు, విశేష దర్శన టికెట్లు, ఆటో, బోటు యరియు ఇతరతరా చిల్లర ఖర్చులకు యాత్రికులే చెల్లించవలెను.
4. ఉదయం టీ/కాఫీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ యాజమాన్యం వారిచే ఏర్పాటు చేయబడును.
5. రోజుకు రెండు లీటర్ల త్రాగు నీరు బాటిల్స్ ఇవ్వబడును.
6. యాత్రికుల సామాన్లకు, వ్యక్తిగత వస్తువులకు, డబ్బులు మరియు బంగారు ఆభరణాలు ఎవరికి వారే తగు జాగ్రత్తలు తీసుకోనవలెను. యాజమాన్యం వారికి ఏ విధమైన సంబంధము ఉండదు.
7. యాజమాన్యం వారికి ఎల్లప్పుడూ యాత్రికులు సహాయ సహకారములతో యాత్రను దిగ్విజయంగా పూర్తిగావించవలనని మనవి.
8. అనుకోని పరిస్థితులు (ప్రకృతి, రాజకీయ, ప్రాంతీయ మరియు అనూహ్యమైన) సంభవించిన యెడల యాత్రలో మార్పులు చేర్పులు చేయబడును అందుకు యాత్రికుల సహకరించవలెను.
9. ఎడ్వాన్సు తిరిగి ఇవ్వబడదు.
10. ఆటో, పడవ, గుర్రం, డోలి, హెలికాప్టర్ ప్రవేశ రుసుములు, ప్రత్యేక దర్శనములకై అయ్యే ఖర్చులు మరియు యే ఇతరతర ఖర్చులు ఉన్నాను యాత్రికులే చెల్లించవలెను.
* యాత్రకు తప్పని సరిగా డాక్టర్ చే నిర్ధారణ చేయబడిన కరోనా నెగటివ్ (RT-PCR) ధ్రువీకరణ పత్రము మరియు వాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న ధ్రువీకరణ పత్రము తప్పనిసరిగా వెంట తీసుకురావలెను లేని యెడల ప్రభుత్వ ఆంక్షలు ఉన్న చోట
అనుమతింపబడరు.
* నిత్యవసర మందులు వెంట తెచుకొనవలెను
ఎవరు నిర్వహిస్తున్నారు